ఆటోలో మర్చిన వస్తువులు తిరిగి అప్పగింత

ఆటోలో మర్చిన వస్తువులు తిరిగి అప్పగింత

అనకాపల్లి: గవరపాలెం ప్రాంతానికి చెందిన విషకోటి రజని తన బంధువుల పెళ్లికి సంబంధించిన బట్టలు, విలువైన వస్తువులను ఆటోలో మర్చిపోయారు. తలుపులమ్మ ఆటో స్టాండ్‌కు చెందిన డ్రైవర్ రాజేశ్ వాటిని గుర్తించి భద్రంగా ఉంచి, పోలీస్ స్టేషన్‌లో బాధితురాలికి అప్పగించారు. డ్రైవర్ నిజాయితీకి స్థానికులు ప్రశంసలు తెలిపారు.