ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కార్యాలయంలో ఎంపీ
NTR: విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ ఎరైవల్ బ్లాక్ 4వ ఫ్లోర్ లో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయాన్ని ఎంపీ కేసినేని చిన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ బాలకోటయ్యను, డైరెక్టర్లను ఎంపీ అభినందించారు. ప్రజా సేవకుడు పోతుల బాలయ్య ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.