ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్
కృష్ణా: ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం అవనిగడ్డలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు 23 అర్జీలు సమర్పించారు. అర్జీలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు పరిశీలించారు.