VIDEO: సాగర తీరాన ఆధ్యాత్మిక శోభ
VSP: పండుగ వేళ విశాఖ నగరంలోని రుషికొండపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. పండుగ సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాగర తీరానికి విచ్చేసిన పర్యాటకులు, స్థానిక భక్తజనం భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో పోటెత్తాయి.