మహిళలతో కిక్కిరిసిన బస్టాండ్

మహిళలతో కిక్కిరిసిన బస్టాండ్

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు. ఇవాళ వాడపల్లి బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. వాడపల్లి ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత సౌకర్యం అందుబాటులోకి రావడంతో బస్టాండ్ మహిళలతో రద్దీగా మారింది. ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు మహిళలు ఎగబడ్డారు.