HYD: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలు శిక్ష

పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికను నమ్మించి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ RJNR ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. గచ్చిబౌలి పోలీసుల వివరాలు.. NGKL జిల్లాకు చెందిన సతీశ్ కుమార్(23) ఓ బాలిక(15)తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.