ఇరాన్తో టచ్లోనే ఉన్నాం: విదేశాంగ శాఖ
ఇరాన్ విదేశాంగ మంత్రితో మూడుసార్లు చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. చివరి విడత చర్చల్లో భారత నౌకల భద్రతపై చర్చించినట్లు తెలిపారు. ఇరాన్తో టచ్లో ఉన్నామని వెల్లడించారు. టెహ్రాన్లో ప్రవాస భారతీయులపై భారత ఎంబసీ ఆరా తీసిందని పేర్కొన్నారు. హోర్మూజ్ జలసంధి నుంచి నౌకలకు ఇప్పటికే అనుమతి లభించిందని ప్రకటించారు. త్వరలో రవాణా మరింత పెరుగుతుందన్నారు.