'రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు'
కృష్ణా: కోడూరు అవుట్ పాల్స్ స్లూయిస్ మరమ్మతు పనులను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవుట్ పాల్స్ గేట్లు పాడైన కారణంగా, సుమారు 1500 ఎకరాలలో ఉప్పు నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అధికారులు జాప్యం చేయడంతో రైతులే స్వచ్ఛందంగా మరమ్మతు పనులు చేపట్టారని చెప్పుకొచ్చారు.