అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారి అలంకరణ
SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట (ఈశ్వరపురం)లోని దుర్గాభవాని ఆలయ 25 వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిపించారు. చివరి రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు.