'కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి'
MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చాలని ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు శారద డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం పిలుపుమేరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణలో కోనాయపల్లి సర్పంచ్ మన్నే కళ్యాణ్కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.