లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్సై
సూర్యాపేట పట్టణంలో సోమవారం రాత్రి పలు లాడ్జిలో ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విజిటర్స్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానితుల వివరాలు ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని లాడ్జి యజమానాలను హెచ్చరించారు.