ఆలమూరు జనార్ధన స్వామి ఆలయంలో తనిఖీలు

ఆలమూరు జనార్ధన స్వామి ఆలయంలో తనిఖీలు

కోనసీమ: ఆలమూరు జనార్ధన స్వామి వారి ఆలయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, వెండి బంగారు ఆభరణాల తనిఖీదారు విళ్ళ పల్లంరాజు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రతి మూడేళ్లకోసారి స్వామివారి ఆభరణాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. జనార్ధన స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ పార్వతీ, భట్టీవిక్రమార్కేశ్వర స్వామి వారి దేవస్థానం ఆభరణాలను సైతం ఆయన తనిఖీ చేశారు.