చివ్వేంల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

SRPT: చివ్వేంల మండల పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషనులో రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. ఎస్సై మహేష్ ఉన్నారు.