'సీసీఐ ద్వారా రైతుల పత్తి కొనుగోలు చేయాలి'
ADB: తేమతో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా రైతుల పత్తి కొనుగోలు చేయాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం కో-కన్వీనర్ శోభన్ డిమాండ్ చేశారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఆదిలాబాద్ సీసీఐ రీజినల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని, అలాగే కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలని వారు కోరారు.