అదనపు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం: ఎంపీ

అదనపు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం: ఎంపీ

MDCL: రామంతపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ నియోజకవర్గానికి అదనపు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.