అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణ 4వ వార్డులో 20 లక్షల నిధులతో, 3వ వార్డు నాగేంద్ర నగర్లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సోమవారం మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.