జడ్చర్ల నియోజకవర్గంలో రెండు ఆసుపత్రుల స్థాయి పెంపు

జడ్చర్ల నియోజకవర్గంలో రెండు ఆసుపత్రుల స్థాయి పెంపు

MBNR: జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రెండు ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 పడకల స్థాయిలో ఉన్న బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలకు పెంచుతూ, అలాగే 23 పడకల స్థాయిలో ఉన్న బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.