రంగనాథ స్వామిని దర్శించుకున్న ఎంపీ
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.