షారుఖ్, కాజోల్ సినిమాకు అరుదైన గౌరవం
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' మూవీకి అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే 30ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కాజోల్, షారుఖ్ పాత్రలైన రాజ్, సిమ్రాన్ కాంస్య విగ్రహాన్ని లండన్లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్లో ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన షారుఖ్, కాజోల్ తమ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.