గాజువాకలో వాహన మిత్ర సంబరాలు

VSP: సీఎం చంద్రబాబు దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నారని, దీని ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కు రూ.15,000 అందజేయనున్నారని ఆటో కార్మికుల రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం తెలిపారు. గాజువాకలోని శుక్రవారం శ్రీశ్రీశ్రీ కుంచుమాంబ ఆటో స్టాండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.