యుద్ధం కేవలం సరిహద్దుల్లో కాదు: రాజ్నాథ్
ఉత్తరాఖండ్లోని రైజింగ్ డే వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని అభిప్రాయపడ్డారు. యువత అన్నింటికీ సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.టెక్నాలజీ, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.