ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు

WGL: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మల్లికార్జునస్వామి, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మను భక్తులు దర్శించుకున్నారు. భక్తులు రుద్రాభిషేకం, ఒగ్గు పూజలతో పట్నం వేసి బోనం సమర్పించి పూజలు చేశారు. అనంతరం అర్చకులు మధు శర్మ భక్తులకు గోత్రనామాలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.