కుప్పంలో టపాసులు సీజ్

కుప్పంలో టపాసులు సీజ్

CTR: కుప్పంలోని ప్యాలెస్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేసినట్లు అర్బన్ CI శంకరయ్య తెలిపారు. ప్యాలెస్ ఏరియాలో దేవేంద్ర తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చిన్నపాటి షెడ్డు ఏర్పాటు చేసి, టపాసులు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో తనిఖీలు చేపట్టి రూ.4,22,250 విలువ గల టపాసులను స్వాధీనం చేసుకున్నారు.