నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

AKP: కశింకోట మండలం నర్సింగబిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నర్సింగబిల్లి, జె. తుని, ఏనుగుతుని, త్రిపురవాణిపాలెం, చింతలపాలెం, తాళ్లపాలెం, పరవాడపాలెం తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.