దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి పర్యటన
NDL: దక్షిణ కొరియాలో నాలుగో రోజు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ పర్యటన కొనసాగుతుంది. స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం, పెట్టుబడులే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. సియోల్ సమీపంలో స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో 2025ను సందర్శించారు. సియోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎక్స్పో నిర్వహించారు. అనంతరం సిటీనెట్ CEO చాంగ్ జే బక్తో సమావేశమయ్యారు.