భారత్లో ఇమ్రాన్, బిలావల్ భుట్టో X ఖాతాలు బ్లాక్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పాక్కు చెందిన పలువురు ప్రముఖుల X ఖాతాలను నిలిపివేసింది. తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోల X ఖాతాలను బ్లాక్ చేసింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక X అకౌంట్ను కూడా బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.