జిల్లాలో పోలీసుల అవగాహన సదస్సు
GDWL: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్డకల్ మండలం బిజ్వారం గ్రామంలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టం మరియు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అప్రమత్తతతోనే ఇంటి భద్రత, సమాజ రక్షణ సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు వివరించారు.