PMAY గడువు పెంపు
ATP: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద జిల్లాలో ఇళ్లు లేని నిరు పేదల నుంచి దరఖా స్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలు తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.