జిల్లాలో యూరియా కొరత.. రైతులకు తీరని ఇబ్బందులు
మెదక్: జిల్లాలో యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. సహకార కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోంది. సరైన సమయంలో ఎరువులు అందకపోవడంతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.