'సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది'
GNTR: రాజధాని భూ సమీకరణ పథకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో శనివారం జేసీ భార్గవ్ తేజతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారుల నుంచి పలు సూచనలు స్వీకరించిన కన్నబాబు, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.