రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతులు కీలకం: MLA
గుంటూరు సిద్ధార్ధ గార్డెన్స్లో శుక్రవారం జరిగిన క్రెడ్ ప్రాపర్టీ షో-2025ను ఎమ్మెల్యే మాధవి సందర్శించి, పలు స్టాల్స్ను ప్రారంభించారు. 70కి పైగా స్టాల్స్లో బిల్డర్లు, బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతులు కీలకమని, కూటమి ద్వారా అమరావతి అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.