ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈవో

VZM: వేపాడ మండలం సోంపురం ఎంపీపీ పాఠశాలను ఎంఈవో బాల భాస్కరరావు శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.