ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
విశాఖ వుడా చిల్డ్రన్ థియేటర్లో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాసం క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.