ట్రాన్స్ఫార్మర్లు కాపాడేందుకు పకడ్బందీ చర్యలు: SE
PDPL: వర్షాకాలంలో పిడుగులు, మెరుపుల నుంచి విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను కాపాడేందుకు పెద్దపల్లి సర్కిల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో 122 లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశామని, అధిక వోల్టేజ్ను భూమిలోకి మళ్లించి బ్రేక్ డౌన్లను నివారిస్తాయని పేర్కొన్నారు. తద్వారా అంతరాయం లేని విద్యుత్ అందుతుందన్నారు.