ఈనెల 4న ఉద్యాన నర్సరీలో మామిడికాయల వేలం
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని ప్రభుత్వ ఉద్యాన నర్సరీలో మామిడికాయల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారి అర్చన గురువారం ప్రకటనలో తెలిపారు. నర్సరీలోని 300 మామిడి చెట్ల దిగుబడికి ఈనెల 4న ఉదయం 10 గంటలకు వేలం పాట జరుగుతుంది. ఆసక్తి గల వారు రూ.1,000 డిపాజిట్ చెల్లించి పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు నర్సరీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.