గ్రంథాలయాల ఆధునీకరణపై ఛైర్మన్ కీలక చర్చ

గ్రంథాలయాల ఆధునీకరణపై ఛైర్మన్ కీలక చర్చ

ATP: రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ కోటేశ్వరరావుతో ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల మరమ్మతులు, నూతన పుస్తకాల కొనుగోలుకు నిధులు కేటాయించాలని కోరారు. పారదర్శకత కోసం సిబ్బందికి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు.