మరో ఉగ్ర కుట్రకు ప్లాన్.. పోలీసులు భగ్నం
ఢిల్లీ ఉగ్రదాడి మరవకముందే.. పంజాబ్లో మరో కుట్రకు ISI ప్లాన్ చేసింది. ఈ సారి గ్రెనేడ్ దాడికి ప్లాన్ చేయగా పంజాబ్ పోలీసులు దానిని భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో విదేశీ హ్యాండ్లర్లకు అనుబంధంగా ఉన్న 10 మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరంతా మలేషియాలో ఉన్న ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.