ట్రంప్ కొత్త టారిఫ్లపై 20 రాష్ట్రాలు దావా
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 15 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ కొత్త టారిఫ్లపై 20 రాష్ట్రాలు దావా వేశాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, డెమోక్రటిక్ పార్టీ అటార్నీ జనరల్స్ కోర్టు మెట్లు ఎక్కారు. ప్రజలపై అక్రమ టారిఫ్లు తొలగించాల్సిన సమయంలో వాటిని పునరుద్ధరించకూడదని ఆరిగాన్ అటార్ని జనరల్ డాన్ రేఫీల్డ్ వ్యాఖ్యానించారు.