సత్తెనపల్లి నియోజకవర్గానికి రూ. 9.66 కోట్ల నిధులు
PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం రూ. 9.66 కోట్ల ఏపీ ఆర్ఆర్ఎస్పి (APRSP) నిధులను మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించిన ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.