ముక్తేశ్వరం సెంటర్లో కూటమి నేతల సంబరాలు
కోనసీమ: అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముక్తేశ్వరం సెంటర్లో కూటమి నేతలు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 'నా రాజధాని - నా అమరావతి' అంటూ నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి సాధన కు కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు.