లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు
PPM: సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపులు పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెచ్చిన వివిధ రకాల పుష్పాలు తులసి మాలలతో స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు మాట్లాడుతూ.. స్వామివారిని విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని తెలియజేశారు.