బాలాజీ మందిరంలో ముగిసిన ప్రభాత్ పేరి
KMR: కార్తీక మాస ప్రభాత్ పేరి కార్యక్రమాలు భక్తి పరవశంలో ముగిశాయి. ఇవాళ మద్నూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ మందిరం ఆవరణలో ప్రభాత్ పేరి ముగింపు సందర్భంగా అన్నప్రసాదం నిర్వహించారు. గత 35 రోజులుగా ప్రతీ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి, గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ భజనలతో ఆలయాల ప్రదర్శన చేసిన భక్తులు భక్తి ఉత్సాహాన్ని చాటారు.