జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.