భార్యను కిరాతకంగా చంపిన భర్త

భార్యను కిరాతకంగా చంపిన భర్త

ప్రకాశం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బేస్తవారిపేట మండలం పీవీపల్లిలో ఓ భర్త భార్యను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.