గూడ్స్ ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

వరంగల్: నర్సంపేట పట్టణంలో నర్సంపేట- వరంగల్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం .. వరంగల్ నుండి నర్సంపేటకు పండ్ల లోడ్తో వస్తున్న గూడ్స్ ఆటో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్థానిక బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు శ్రీకర్, శివాజీ తీవ్రంగా గాయపడ్డారు.