పాఠశాల విద్యార్థులకు ఫిజియోథెరపీ క్యాంప్
KMR: జిల్లాలోని పిట్లం ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ఫిజియోథెరపీ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వి. సారిక, ఎస్ఏ ప్రమోద్ కుమార్, ఐఈఆర్పీ ఎం. కమల్ కిషోర్ హాజరయ్యారు. ఈ క్యాంప్లో పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొని సేవలను వినియోగించుకున్నారు. నిపుణుల సూచనలతో ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.