జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన

జట్టీ నిర్మాణానికి స్థల పరిశీలన

AKP: నక్కపల్లి మండలం బోయపాడు తీర ప్రాంతంలో జట్టి నిర్మాణానికి స్థలాన్ని మత్స్యశాఖ అధికారులు TDP నాయకులు శనివారం పరిశీలించారు. నక్కపల్లి మండలం తీర ప్రాంతంలో ప్రభుత్వం జట్టీ మంజూరు చేసింది. రూ.32 కోట్ల వ్యయంతో జట్టీ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హోంమంత్రి ఆదేశాల మేరకు అధికారులు నక్కపల్లి మండలంలో తీర ప్రాంతంలో పర్యటించారు.