స్వర్ణభారతీనగర్‌లో మహిళ అదృశ్యం

స్వర్ణభారతీనగర్‌లో మహిళ అదృశ్యం

గుంటూరు స్వర్ణభారతీనగర్‌కు చెందిన గుండా ఆదిలక్ష్మి ఈ నెల 12న ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె భర్త వీరాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ గురించి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని కోరారు.