బాపట్లలో వంతెన పనుల పరిశీలన
BPT: ముత్తాయపాలెం-కప్పలవారిపాలెం మధ్య నూతన వంతెన పనులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు బుధవారం పరిశీలించారు. నాగరాజు కాలువపై రూ.14 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. వంతెన పూర్తయితే ప్రజల దశాబ్దాల కష్టాలు తీరతాయన్నారు. ప్రయాణ దూరం తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని తెలిపారు. గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు.