ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ :ఎస్పీ

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ :ఎస్పీ

జగిత్యాల జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిగా శాంతియుత వాతావరణంలో ముగిసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.